భారతదేశం, ఆగస్టు 7 -- భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికంలో (క్యూ1) అద్భుతమైన ఆర్థిక ఫలితాలను సాధించింది. జూన్ త్రైమాసికంలో బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన (YoY) 10.23 శాతం వృద్ధితో రూ. 21,121.22 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సాధించిన రూ. 19,160.44 కోట్ల లాభంతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. ఈ మేరకు జూన్ త్రైమాసిక ఆర్థిక గణాంకాలను బ్యాంక్ యాజమాన్యం శుక్రవారం (ఆగస్టు 7న) విడుదల చేసింది.

రిటైల్, కార్పొరేట్ రుణాల విభాగాల్లో వృద్ధి నమోదవ్వడంతో ఎస్‌బీఐ వడ్డీ ఆదాయం గణనీయంగా పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ రూ. 46,992 కోట్ల వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో వచ్చిన రూ. 40,907 కోట్లతో పోలిస్తే ఇది 14.88 శాతం పెరిగింది. బ్యాంక్ సాధించిన నికర వడ్డీ మార్జిన్ (N...