భారతదేశం, ఫిబ్రవరి 26 -- మానవత్వం ఇంకా చాలా మందిలోనే ఉంది. అవసరమైనవారి గుండె తడిని అర్థం చేసుకునేవారు ఇంకా లోకంలో చాలా మందే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న చిట్టితల్లి పునర్విక ఘటనే ఇందుకు ఉదాహరణ. సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రజలు ఏకమై.. పునర్వికకు పునర్జన్మను ప్రసాదించారనే చెప్పాలి. రూపాయి.. రెండు రూపాయలు కాదు.. ఏకంగా రూ.16 కోట్లను సమకూర్చారు. ఇది జరిగే పనేనా అనుకున్నవారంతా ఇప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు. పునర్విక ఇంజక్షన్ కోసం రూ.16 కోట్లు సమకూరినట్టుగా తాజాగా పాప తండ్రి సురేష్ కుమార్ వెల్లడించారు. డబ్బులు ఇక ఎవరూ కలెక్ట్ చేయెుద్దని కోరారు.

కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన పదకొండు నెలల చిన్నారి పునర్విక ప్రాణాలను సోషల్ మీడియా కాపాడింది. ఆమె వెన్నెముక కండరాల క్షీణత (SMA టైప్-1) అనే అరుద...