భారతదేశం, మార్చి 25 -- సామాన్యుడికి కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 'రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (RCS) - మోడిఫైడ్ ఉడాన్' (Modified UDAN) పథకానికి ఆమోదముద్ర వేశారు. వచ్చే పదేళ్ల కాలానికి (ఆర్థిక సంవత్సరం 2026-27 నుండి 2035-36 వరకు) మొత్తం Rs.28,840 కోట్ల బడ్జెట్ సాయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

'వికసిత్ భారత్ 2047' దార్శనికతలో భాగంగా దేశవ్యాప్త విమానయాన వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ భారీ నిధులు కేటాయించారు.

టైర్-2, టైర్-3 నగరాల్లో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.

2016 అక్టోబర్‌లో 'ఉడాన్ 1.0' ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు 95 విమా...