భారతదేశం, ఆగస్టు 8 -- Rishabh Pant Plea To CM Pushkar Singh Dhami: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన సొంతూరిపై ప్రేమను చాటుకున్నారు. ఢిల్లీలోని నివాసాన్ని ఖాళీ చేసి, తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో మొదటి ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తున్నారు.

ఈ మేరకు స్థలం కొనుగోలుకు సాయం చేయాలంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి అర్థరాత్రి వేళ విజ్ఞప్తి చేశారు రిషబ్ బంత్. ప్రస్తుతం శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం లంకలో ఉన్న పంత్, సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు.

గత మూడేళ్లుగా ఉత్తరాఖండ్‌లో సరైన స్థలం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదీ కొలిక్కి రావడం లేదని పంత్ తెలిపారు. ఈ విషయమై రాత్రి 12:46 గంటలకు సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ సీఎం ధామీకి ట్యాగ్ చేశారు.

"హలో సర్, ఎలా ఉన్నారు? సొంత రాష్ట్రం నుంచి వచ్చి చాలా క...