భారతదేశం, సెప్టెంబర్ 5 -- ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి పంపిణీ చేసే సన్నబియ్యాన్ని అమ్ముకుంటే కఠిన చర్యలు తప్పవని, అలాంటి వారి రేషన్ కార్డులను తక్షణమే రద్దు చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పుటాని తండాలో నిర్వహించిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్ కార్డు ద్వారా వచ్చే బియ్యాన్ని్ అమ్ముకునేవారిని హెచ్చరించారు. ఈ బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తామన్నారు.

గుడిసెల్లో జీవించే అర్హులైన పేదలందరికీ వెంటనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని, పేదరికామే ప్రామాణికమని స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్న పేదలకు ఇళ్లు మంజూ...