భారతదేశం, ఆగస్టు 31 -- దిల్లీలో 2012లో దేశాన్ని కుదిపేసిన 'నిర్భయ' దారుణాన్ని గుర్తుచేస్తూ గ్రేటర్ నోయిడాలో మరో ఘోరం వెలుగుచూసింది. కదులుతున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో 16ఏళ్ల బాలికపై బస్సు డ్రైవర్, కండక్టర్ దారుణంగా సమూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్​లోని మైన్‌పురి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక చదువు విషయంలో తల్లి కోప్పడటంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నోయిడా సెక్టార్ 63లో నివసిస్తున్న బంధువుల ఇంటికి బయలుదేరింది. ఆగస్టు 4న రాత్రి 9 గంటల సమయంలో కుండపోత వర్షం పడుతుండగా గ్రేటర్ నోయిడాలోని దట్టమైన చీకటితో నిండిన 'పరీ చౌక్' వద్ద ఆ బాలిక బస్సు దిగింది. అక్కడి నుంచి తాను వెళ్లాల్సిన ప్రదేశం ఇంకా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అద...