భారతదేశం, ఏప్రిల్ 13 -- బాలీవుడ్ అగ్ర కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ అనేక సినిమాల్లో తన నటనతో నవ్వించారు. ఇటీవల కోర్టు కేసు నుంచి బయటకు వచ్చిన రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం హారర్ కామెడీగా తెరకెక్కిన 'భూత్ బంగ్లా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

భూత్ బంగ్లా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు రాజ్‌పాల్ యాదవ్. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నిర్మించిన 'ఓం శాంతి ఓం' సినిమాలో రాజ్‌పాల్ కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను రాయించారట. కానీ, ఆ పాత్రను రాజ్‌పాల్ యాదవ్ తిరస్కరించినట్లు షారుఖ్ దగ్గర ఎవరో తప్పుడు సమాచారం చేరవేశారని ఆయన తెలిపారు.

"నీకోసం ఒక మంచి లెంత్ ఉన్న రోల్ రాశాము. కానీ, నీకు టైమ్ లేదని రిజెక్ట్ చేశావంట కదా?" అని స్వయంగా షారుఖ్ ఖాన్ అడిగే వరకు రాజ్ పాల్‌కు ఈ విషయం...