భారతదేశం, సెప్టెంబర్ 1 -- Raidurgam Hit and Run Case : హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన హిట్ అండ్ రన్ కేసులో సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రముఖ టాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను రాయదుర్గం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వేగంగా వచ్చిన ఆటోమొబైల్ వాహనంతో ఢీకొట్టడంతో.. ఒకరి మృతితో పాటు మరొకరు తీవ్రంగా గాయపడటానికి కారణమైనందుకు సందీప్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 31, 2026 నాడు తెల్లవారుజామున 4:15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఖాజాగూడలోని అంకుర ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఈ సం...