భారతదేశం, జూలై 17 -- వ్యాపార రంగమైనా, వ్యక్తిగత జీవితమైనా సంక్షోభాలు ఎదురైనప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకెళ్లాలని మేనేజ్‌మెంట్ పితామహుడు పీటర్ డ్రక్కర్ ఎప్పుడో చెప్పారు. కాలానుగుణంగా మనల్ని మనం మార్చుకోకపోతే వెనకబడిపోతామని ఆయన హెచ్చరించారు.

"సంక్షోభ కాలంలో ఎదురయ్యే అతి పెద్ద ప్రమాదం ఆ సంక్షోభం కాదు... నిన్నటి ఆలోచనలతో ముందడుగు వేయడమే" అని పీటర్ డ్రక్కర్ పేర్కొన్నారు.

ఆస్ట్రియన్-అమెరికన్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, విద్యావేత్త అయిన పీటర్ డ్రక్కర్ మాటలు.. మారుతున్న కాలానికి అనుగుణంగా మారడం ఎంత అవసరమో గుర్తుచేస్తాయి. మార్పు అనేది అనివార్యమైనప్పుడు దానిని ఎదిరించడం కంటే, కొత్త ఆలోచనలతో స్పందించడమే విజేతల లక్షణమని ఆయన విశ్వసించారు.

మనుషులు ఎప్పుడూ తమకు అలవాటైన పద్ధతుల్లోనే ప్రయాణించడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా కష్టకాలంలో తెలిసిన దారిలోనే వెళ్లడ...