భారతదేశం, ఆగస్టు 19 -- School Principal Roopa Reddy Murder Case : నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించి కటకటాల్లోకి నెట్టారు. డబ్బుపై ఆశతో పాటు ప్రిన్సిపాల్‌పై పెంచుకున్న కక్షే ఈ ఘాతుకానికి కారణమని విచారణలో తేలింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు పదో తరగతి మైనర్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైంటిఫిక్ దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలు మరియు సాంకేతిక విశ్లేషణ ఈ కేసును కొలిక్కి తేవడంలో కీలక పాత్ర పోషించాయి.

హత్యకు గురయ్యే ముందు ప్రిన్సిపాల్ రూపారెడ్డి మాట్లాడిన చివరి ఒకే ఒక్క పదం ఈ కేసు దర్యాప్తులో అతిపెద్ద మలుపుగా మారింది. ఫోన్ సంభాషణ ముగిసే సమయంలో ఆమె ...