భారతదేశం, జూలై 14 -- తెలంగాణలో కర్ణాటక రాష్ట్రం తరహాలో శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం(Permanent Residence Certificate - PRC) విధానాన్ని ప్రవేశపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ వెల్లడించారు. ఈ కొత్త విధానం సాధ్యసాధ్యాలను సమగ్రంగా పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో దీర్ఘకాలంగా నివసిస్తున్న ప్రజలు తమ శాశ్వత నివాసాన్ని సులభంగా నిరూపించుకోవడానికి వీలుగా ఒక ప్రామాణిక ప్రభుత్వ పత్రాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షబ్బీర్ అలీ వినతిపత్రం సమర్పించారు.

షబ్బీర్ అలీ అందించిన ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో...