భారతదేశం, ఆగస్టు 4 -- ప్రజల సమస్యల పరిష్కార వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పారదర్శకత, బాధ్యతాయుత పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 'ప్రజావాణి' కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రతి వారం సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.

తహసీల్దార్, ఎంపీఓ, మండల వ్యవసాయ అధికారి, ఎంఈఓ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి, పోలీస్, ఇతర మండల స్థాయి శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరిం...