భారతదేశం, మార్చి 8 -- ఈ ఏడాది ఏ రకమైన విద్యుత్ ఛార్జీల పెంపు లేదని.. విద్యుత్ నియంత్రణ సంఘం ముందు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలిపింది. 50,942 కోట్ల ఆదాయ అవసరం ఉంది. ప్రస్తుత విద్యుత్ టారిఫ్‌ల నుండి అంచనా వేసిన ఆదాయం 40,959 కోట్లు. 9,583 కోట్ల ఆదాయ అంతరం ఉంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన మొత్తం 38,492 కోట్లు. కమిషన్ ముందు హాజరైన TGSPDCL సీఎండీ జితేష్ వి.పాటిల్.., ఈ అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వం నుండి మద్దతును ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

TGSPDCL పరిధిలో 1,20,95,963 మంది వినియోగదారులు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 12,09,563 మంది వినియోగదారులు అదనంగా చేరారు. రికార్డు స్థాయిలో 35,175 ఎంవీఏ లోడ్ స్థాయిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు 39,556 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ఇందులో...