భారతదేశం, ఏప్రిల్ 18 -- PM Modi Speech Women Reservation Bill : మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం దారుణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టామని. కానీ కాంగ్రెస్, డీఎంకే కలిసి బిల్లును అడ్డుకున్నాయన్నారు.రిజర్వేషన్ల కోసం తన పోరాటం ఇంకా ముగియలేదన్నారు.

శనివారం జాతిని ఉద్దేశించిన మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ.. 'నారీ శక్తి వందన్ అధినియం' బిల్లు లోక్‌సభలో వీగిపోవటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు మహిళా సాధికారతకు అడ్డుపడి పెద్ద పాపం చేశాయని ధ్వజమెత్తారు.

నల్ల దుస్తులు ధరించినంత మాత్రాన చీకటి ఒప్పందాలను దాచి పెట్టలేరని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. "నేను అన్ని పొలిటికల్ పార్టీలతో పర్షనల్‌గా మాట్...