భారతదేశం, మే 10 -- PM Modi Speech in Hyderabad : ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ఆయన. ముందుగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆ తర్వాత సాయంత్రం పరేడ్ గ్రౌండ్ వేదికగా బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముందుగా తెలుగులో మట్లాడారు. 'ప్రియమైన తెలంగాణ ప్రజలారా.హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ ప్రసంగం ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ లో తొలిసారిగా బీజేపీ గెలిచిందన్నారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మొన్నటి అసెంబ్లీలో ఎన్నికల్లో అస్సోంలోనూ విజయం సాధించామని.. పుదిచ్చేరిలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే ఎక్కడ అవినీతి రాజ్యమేలుతుందని ప్రధాని మోదీ విమర్శించారు. బెంగాల్ ప్రజలు టీఎంసీ, లెఫ...