భారతదేశం, ఆగస్టు 14 -- వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అగ్రిసెట్ (AGRICET), అగ్రి ఇంజినీరింగ్ సెట్ (AGRIENGGCET)-2026 ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 31 (ఆగస్టు 31) వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య తెలిపారు.

ఈ ప్రవేశ పరీక్షల ద్వారా వర్సిటీ పరిధిలోని బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) కోర్సుల మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

పరీక్ష ప్రశ్నాపత్రం, ప్రాథమిక కీ సెప్టెంబర్ 15 మధ్యా...