భారతదేశం, మే 30 -- Peddi movie ticket price Telangana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ భారీ సినిమా విడుదలకు సర్వం సిద్ధమవుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీటి కోసం పెద్ది మేకర్స్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ ప్రభుత్వాలను సంప్రదించారు. అయితే వీరికి ఏపీ ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. కానీ తెలంగాణలో మాత్రం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో చిత్ర యూనిట్ తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుందని తెలుస్తోంది.

గత కొన్ని నెలలుగా టాలీవుడ్​లో పెద్ద సినిమా రాలేదు. ఫలితంగా మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న పెద్దిపై భార...