భారతదేశం, జూన్ 2 -- జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశంలో జనసేన ముఖ్య నాయకులు కూడా పాల్గొననున్నారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రెస్ మీట్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ పోలీసుల అనుమతిపై ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఈ రోజు సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్‌లోని నా నివాసంలో మీడియా సమావేశం ఉంటుంది. జనసేన నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహి...