భారతదేశం, ఏప్రిల్ 21 -- పశుపోషకుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం, పశుసంవర్ధక రంగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ (PKCC) పథకాన్ని ప్రారంభించింది. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి. దామోదర్ నాయుడు ఒక పత్రికా ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ పథకం ద్వారా పశువులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లను పెంచే రైతులు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను పొందవచ్చని తెలిపారు.

అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడటాన్ని తగ్గించడం, సుస్థిర పశు నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. PKCC పథకం కింద, అర్హులైన రైతులు ఎలాంటి హామీ లేకుండా 7 శాతం వడ్డీ రేటుతో రూ.1.60 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం రూ.3 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఏడాదిలోగా రుణం తిరిగి చెల్లి...