భారతదేశం, జూన్ 14 -- Papikondalu Boating Stopped: రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు వెళ్లాలనుకునే పర్యాటకులకు అధికారులు ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. గోదావరి నదిలో ప్రయాణించే పర్యాటక బోట్ల నిర్వహణ, ప్రయాణికుల రక్షణపై తీవ్ర భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఇటీవలనే దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయ విహారయాత్ర రేవు నుంచి ఒక ప్రైవేట్ పర్యాటక బోటులో దాదాపు 89 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు. అయితే.. ఆ బోటు దేవీపట్నం పాత పోలీసుస్టేషన్‌ ప్రాంతానికి చేరుకునే సరికి హఠాత్తుగా ఇంజిన్‌లో తీవ్ర సాంకేతిక లోపం ఏర్పడిం...