భారతదేశం, మార్చి 22 -- పాన్ (పర్మనెంట్​ అకౌంట్​ నెంబర్​) కార్డ్ దరఖాస్తుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి, అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి 'సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్' సోషల్ మీడియా వేదికగా కీలక అప్‌డేట్స్ ఇచ్చింది. ఆ వివరాలు ఇవే:

అదనపు పత్రాలు తప్పనిసరి: ప్రస్తుతం కేవలం ఆధార్ కార్డు ఉంటే పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఏప్రిల్ 1 నుంచి ఆధార్‌తో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ కోసం అదనపు డాక్యుమెంట్లు సమర్పించాలి. కాబట్టి, సులభంగా ఆధార్‌తో పాన్ పొందాలనుకునే వారికి మార్చి 31, 2026 వరకు మాత్రమే చివరి అవకాశం అని గుర్తుపెట్టుకోవాలి.

ఆధార్ ప్రకారమే పేరు: కొత్త నిబంధనల ప్రకారం, పాన్ కార్డుపై పేరు కచ్చితంగా ఆధార్ క...