భారతదేశం, మే 12 -- Paddy Procurement in Telangana : అన్నదాతల నుంచి ధాన్యం, మొక్కజొన్న సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కొనుగోళ్ల పురోగతిని సమీక్షించారు. ధాన్యం సేకరణను ఒక 'మిషన్ మోడ్‌'లో తీసుకోవాలని.. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి కష్టాలు కలగకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని ఆయన స్పష్టం చేశారు.

గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించాలన్నారు. ధాన్యం లోడ్ తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. అవసరమైతే అలాంటి వా...