భారతదేశం, ఫిబ్రవరి 15 -- టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ బాబు మోహన్, నటి వై విజయ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. 90స్ సమయంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సీన్స్ చాలా వరకు నవ్వించి మెప్పించాయి. అలాంటి సూపర్ హిట్ కామెడీ కాంబినేషన్ ఓటీటీ తెరపై ఎంట్రీ ఇచ్చింది.

కామెడీతో నవ్వించిన బాబు మోహన్, వై విజయ సీరియస్ పాత్రలతో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ బామ్మ చెప్పిన కథ. ఇది ఒక తెలుగు ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. తెలుగులో హారర్, కామెడీ, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా వంటి తరహా జోనర్లలో సినిమాలు రెగ్యులర్‌గా ఎన్నో వస్తుంటాయి.

కానీ, ప్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ వంటి జోనర్‌లో మూవీస్ రావడం చాలా అరుదు. ఈ బామ్మ చెప్పిన కథలో బాబు మోహన్, వై విజయతోపాటు సాయి సోహన్, వినీషా ప్రధాన పాత్రలు పోషించారు. బాబు మోహన్ ఎస్సై చలపతిగా చేస్తే.. వై విజయ బామ...