భారతదేశం, ఏప్రిల్ 22 -- OTT Telugu: థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో అదరగొడుతున్నాయి. పెద్ద తెరపై ఆ మూవీని చూడని ఆడియన్స్.. చిన్న తెరపై మాత్రం తెగ ఎంజాయ్ చేసేస్తుంటారు. ఇప్పుడు అదే నమ్మకంతో 'లేచింది మహిళా లోకం' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లకు ఆడియన్స్ ను రప్పించలేకపోయిన ఈ ఫిల్మ్.. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు వచ్చేసింది.

లేటెస్ట్ తెలుగు కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'లేచింది మహిళా లోకం' సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. బుధవారం (ఏప్రిల్ 22) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ చిత్రం డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం డ్రమ్ములు, కుక్కర్లు ట్రెండ్ గా మారాయి. భార్యాభర్తల మధ్య ఏ చిన్న గొడవ వచ్చినా, వివాహేతర సంబంధాల కారణంగా ఒకరి ప్రాణాలు మరొకరు తీస్తున్న...