భారతదేశం, ఏప్రిల్ 29 -- OTT: పాపులర్ తమిళ డైరెక్టర్ కమ్ నటుడు సెల్వరాఘవన్ లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ సినిమా 'మణిదన్ దైవమంగళం'. థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ ప్రకటించేశారు.

తమిళంలో ఇటీవల వచ్చిన రూరల్ డ్రామా ఫిల్మ్ 'మణిదన్ దైవమంగళం'. ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ చిత్రం సన్ నెక్ట్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. మే 1 నుంచి ఓటీటీ ఆడియన్స్ కు ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కేవలం తమిళంలోనే రిలీజ్ అవుతుంది.

మణిదన్ దైవమంగళం సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్ ఉండటం విశేషం. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, ఖుషీ రవి, ఆర్ఎస్ సతీష్, మైమ్ గోపీ, వైజీ మహేంద్రన్, లిర్థిక, సేలం దీపక్, ఎలా భరత్ తదితరులు నటించారు. మణిదన్ దైవమంగ...