భారతదేశం, ఏప్రిల్ 1 -- ప్రపంచ ఐటీ రంగంలో 'లేఆఫ్స్​' ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సెగ భారతీయులను కూడా తాకింది! అమెరికాకు చెందిన దిగ్గజ ఐటీ సంస్థ ఒరాకిల్​.. భారత విభాగంలోని సుమారు 12వేల మంది ఉద్యోగులను ఒకేసారి తొలిగించినట్టు తెలుస్తోంది. గ్లోబల్ వైడ్‌గా కంపెనీ దాదాపు 30,000 మందిని తీసేయగా, అందులో గణనీయమైన సంఖ్యలో భారతీయులే ఉండటం గమనార్హం.

అయితే ఈ ఒరాకిల్​ లేఆఫ్స్​ ఇక్కడితో ఆగేడట్టు కనిపించడం లేదు! కేవలం నెల రోజుల వ్యవధిలోనే మరో రౌండ్ మాస్ లేఆఫ్స్ ఉండవచ్చని సంస్థలోని మానవ వనరుల (హెచ్​ఆర్​) విభాగం చెప్పినట్టు సమాచారం.

సంస్థాగత మార్పుల కారణంగా కొన్ని పోస్టులు ఎక్కువగా ఉన్నాయని, అందుకే కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒరాకిల్ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో ఈ సంస్...