భారతదేశం, ఏప్రిల్ 27 -- Oil crisis: ప్రపంచానికి ఇంధనాన్ని అందించే ప్రధాన మార్గం 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) ఇప్పుడు మూతపడింది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరడంతో ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు దాదాపుగా స్తంభించిపోయాయి. అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న ఆంక్షలు, మరోవైపు ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. గడిచిన కొద్ది రోజులుగా ఇరాన్ గన్‌బోట్లు నౌకలపై దాడులు చేయడం, అమెరికా నౌకాదళం వాటిని అడ్డుకోవడంతో ఈ జలసంధి ఇప్పుడు యుద్ధ క్షేత్రంగా మారింది.

ఈ దిగ్బంధం వల్ల అత్యధికంగా నష్టపోయే దేశాల్లో భారతదేశం ముందు వరుసలో ఉంది. మన దేశానికి అవసరమైన ముడి చమురులో సుమారు 60 శాతం ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్...