భారతదేశం, సెప్టెంబర్ 11 -- ఉదయాన్నే లేవగానే పొగలు కక్కే వేడివేడి టీ లేదా ఫిల్టర్ కాఫీ తాగడం మన ఇళ్లలో ఒక దినచర్య. ఇరానీ చాయ్ అయినా, కాఫీ అయినా నోరు కాలేంత వేడిగా ఉంటేనే ఆ మజా అనుకుంటారు చాలామంది. అయితే బాగా వేడిగా ఉన్న పానీయాలు తాగడం వల్ల ప్రాణాంతకమైన ఫుడ్​పైప్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం దాదాపు మూడు రెట్లు పెరుగుతుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ తాజా పరిశోధన హెచ్చరిస్తోంది.

యూకే బయోబ్యాంక్, మిలియన్ ఉమెన్ స్టడీ ఆధారంగా దాదాపు 9.8 లక్షల మందిపై 10 ఏళ్లకు పైగా నిర్వహించిన ఈ సుదీర్ఘ అధ్యయన వివరాలను 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్' ప్రచురించింది. పానీయాలను గోరువెచ్చగా తాగేవారితో పోలిస్తే, బాగా వేడిగా తాగే అలవాటు ఉన్నవారికి 'ఒసోఫాగియల్ స్క్వామస్ సెల్ కార్సినోమా' (ఎస్​సీసీ) అనే ఆహారనాళ క్యాన్సర్ వచ్చే ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవ...