భారతదేశం, మార్చి 21 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో అంతా కంగారుపడుతుంటే రఘురాం పక్కింటి వాళ్లు తీసుకొస్తారు. మీ ఇల్లు అనుకుని మా ఇంటి డోర్ కొట్టారని, జాగ్రత్తగా చూసుకోండని చెప్పి వెళ్లిపోతారు పక్కింటివాళ్లు. తనకు రోడ్డు మీద జరిగింది గుర్తు చేసుకుని రోడ్డు మీదకు ఎందుకు వెళ్లాను అని ఆలోచిస్తాడు రఘురాం.

బయట ఏదో జరిగింది, గుర్తు చేసుకోండని జగదీశ్వరి అంటే.. గుర్తు రావట్లేదని రఘురాం చెబుతాడు. రఘురాంకు అంతా కోడలు, చెల్లి ప్రేమగా వడ్డిస్తారు. రఘురాం మూడు ముద్దలు తిని చేయి కడిగేస్తాడు. తినాలనిపించడం లేదని చెబుతాడు. రఘురాంను గదిలోకి తీసుకెళ్తుంది జగదీశ్వరి. నాకు టెన్షన్‌గా ఉంది. కానీ, కారణం గుర్తు రావట్లేదు. చాలా భయంగా ఉందని, ఎవరికో ఏదో ప్రమాదం పొంచి ఉందని భయం కలుగుతుందని రఘురాం అంటాడు.

ఎవ్వరికి ఏ స...