భారతదేశం, మార్చి 3 -- టాలీవుడ్ నటి, నిర్మాత నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకుంది. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి 'రాకాస' మూవీని నిర్మించారు.

ఓటీటీ సిరీస్ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వం వహించిన రాకాస సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ హీరో హీరోయిన్లుగా నటించారు. రాకాస సినిమాను ఏప్రిల్ 3న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఈ క్రమంలో ఆదివారం (మార్చి 1) నాడు రాకాస టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన రాకాసటీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. "పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే ప్రతీ కంటెంట్‌ను ఆడియెన్స్ ...