భారతదేశం, ఆగస్టు 14 -- హైదరాబాద్​లోని ప్రతిష్ఠాత్మక నల్సార్ యూనివర్సిటీ వ్యవహారంలో బార్​ కౌన్సిల్ ఆఫ్​ ఇండియా (బీసీఐ) వ్యవహరించిన తీరుపై భారత దేశ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మిశ్రా తీవ్రంగా స్పందించారు. "బ్యాక్ ఆఫ్" అంటూ గట్టి సందేశాన్ని బీసీఐకి ఇచ్చారు.

ఈ ఏడాది నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మిశ్ర హాజరు కావాల్సి ఉంది. అయితే యువతను 'కాక్రోచ్'లు అన్నారని, ఆయన తమ వర్సిటీకి రాకూడదని అనేక మంది లా స్టూడెంట్స్ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే వర్సిటీ స్నాతకోత్సవంలో చీఫ్ జస్టిస్ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రచారంపై విచారణ జరగాలని, అప్పటివరకు నల్సార్ గ్రాడ్యుయేట్ల ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాలని బీసీఐ తొలుత ఉత్తర్వుల్లో పేర్కొంది.

"ఈ నిరసన ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? నిర్వహించారు? లేదా సమీకరించ...