భారతదేశం, మార్చి 18 -- మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై తెలంగాణ అసెంబ్లీలో ఘాటైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తాము ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, పారదర్శకత లోపించిందని ఆరోపించింది. అయితే ఈ ప్రాజెక్టు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుందని అధికార పక్షం వాదించింది. ప్రతిపక్షాలు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది.

ప్రశ్నోత్తరాల సమయంలో సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్ సహా పలువురు ఎమ్మెల్యేలు ప్రాజెక్టుపై ప్రశ్నలు లేవనెత్తడంతో చర్చ మెుదలైంది. ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. మొదటి దశకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ ...