భారతదేశం, జూలై 14 -- మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ, ఇతర వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం, రాజకీయ ప్రముఖులు, కాపు సంఘాల నేతలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ, అతిపిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి వచ్చారు. 1978లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో కీలక నేతగా ఎదిగారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కాకినాడ లోక్‌సభ సభ్యుడిగా విజయం సాధించారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశారు.

ముద్రగడ ప...