భారతదేశం, జూన్ 1 -- గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వర్షాకాలం దృష్ట్యా జూన్ 1 నుంచి అక్టోబరు 15 వరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలపై నిషేధం అమలు జరుగుతోంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం.. గోదావరి తీరంలో ఏటా విధించే 'మన్‌సూన్ హాలిడే' (వర్షాకాల విరామం) నేటి నుంచి (జూన్ 1) అమలులోకి వచ్చింది. నదుల పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, వర్షాకాలంలో వరదల ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ వార్షిక నిషేధాన్ని విధిస్తారు.

మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ డి. ఫణిభూషణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిషేధాజ్ఞలు సుదీర్ఘ కాలం పాటు కొనసాగనున్నాయి. జూన్ 1 నుంచి ప్రారంభమై.. అక్టోబర్ 15 వరకు అమల్లో ఉంటుంది. గోదావరి తీరంలోని సెమీ-మెకనైజ్డ్ రీచ్‌లు (యంత్రాల ద్వారా ఇసుక తీసే ప్రాంతాలు), పట్టా భూముల...