భారతదేశం, మార్చి 17 -- మెయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. అయితే ఈ కేసును సిట్ తో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 9 మంది అధికారులతో సిట్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సిట్‌ చీఫ్‌గా చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ వ్యవహరిస్తారు. గ్రేహౌండ్స్‌ కమాండర్‌ ఎం.రవీందర్‌, షాదనగర్‌ డీసీపీ శిరీష, ఈగల్ డీఎస్పీలు బుచ్చయ్య, హరీశ్ చంద్రారెడ్డి, మోయినాబాద్ ఎస్‌హెచ్‌వో మల్లిఖార్జున, ఎస్‌ఐలు కోటేశ్వర్‌ రావు, వెంకన్న, సదత్ అలీ సభ్యులుగా ఉన్నారు.

బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఫామ్‌హౌస్‌లో మద్యం పార్టీ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఫామ్‌హౌస్‌లో డ్రగ్ పార్టీ జరుగుతోందని విశ్వసనీయ సమాచారం మేరకు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) ...