భారతదేశం, ఏప్రిల్ 27 -- హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వైశాఖ మాసంలో వచ్చే 'మోహినీ ఏకాదశి'కి ఒక ప్రత్యేకత ఉంది. పురాణ కాలంలో దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మథనం చేసినప్పుడు ఉద్భవించిన అమృతాన్ని కేవలం దేవతలకే దక్కేలా చేసేందుకు శ్రీమహావిష్ణువు అపురూపమైన సుందరాంగి 'మోహిని' అవతారాన్ని ధరించారు. విష్ణుమూర్తి ఈ రూపంలో ప్రత్యక్షమైన రోజే వైశాఖ శుక్ల ఏకాదశి. అందుకే ఈ రోజును మోహినీ ఏకాదశిగా భక్తకోటి అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుంది.

ఈ ఏకాదశి పర్వదినాన కేవలం ఉపవాసం ఉండటమే కాకుండా. రాత్రివేళ చేసే జాగరణకు శాస్త్రాలు విశేష ప్రాముఖ్యతను ఇచ్చాయి. మోహినీ ఏకాదశి నాడు సాయంత్రం పూజ అనంతరం రాత్రంతా హరినామ స్మరణతో మేల్కొని ఉండటం వల్ల ఊహించని పుణ్యఫలాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

సాధారణ సమయంలో భగవంతుని నామాన్ని స...