భారతదేశం, మే 11 -- Hyderabad MMTS trains cancelled : హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. వివిధ నిర్వహణ సంబంధిత కారణాలతో మే 11 (నేడు), మే 12 (రేపు) తేదీల్లో నగరంలోని పలు ఎంఎంటీఎస్ సర్వీసులను పూర్తిగా రద్జు చేసింది. పాక్షికంగా మరికొన్నింటిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా కొన్ని రైళ్లను నిర్ణీత స్టేషన్ల మధ్య నిలిపివేశారు.

నగరంలోని ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే కార్యకలాపాల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....