భారతదేశం, మే 25 -- MJPTBCWREIS Results 2026 : తెలంగాణ రాష్ట్ర బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (MJPTBCWREIS) ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొదటి దశ (First Phase) సీట్ల కేటాయింపు ఫలితాలను సొసైటీ కార్యదర్శి శ్రీ బడుగు సైదులు (IFS) ఆదివారం అధికారికంగా విడుదల చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో జూనియర్ ఇంటర్మీడియట్ (RJC) మరియు డిగ్రీ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఆ వివరాలను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ ఏడాది ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా.. కేవలం విద్యార్థులు తమ పదో తరగతి (SSC) లో సాధించిన మార్కుల (మెరిట్) ఆధారంగానే ఇంటర్మీడియట్ సీట్లను కేటాయించినట్లు కార్యదర్శి స్పష్టం చేశారు. అలాగే...