భారతదేశం, మార్చి 29 -- ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ (MI), మరో అరుదైన ఘనతకు చేరువైంది. ఆదివారం (మార్చి 29) సొంత గడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న పోరుతో ముంబై జట్టు టీ20 క్రికెట్‌లో ఒక చారిత్రక మైలురాయిని అధిగమించింది.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోలక్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న రెండో ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్న ఈ జట్టు నిన్న (మార్చి 28) ఆర్సీబీ వ్యవహరించిన వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, వాంఖెడే స్టేడియంలో కోల్‌కతాతో తలపడుతున్న ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు 300వ టీ20 మ్యాచ్. ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫార్మాట్‌లో ఈ మార్కును అందుకున్న మొట్టమొదటి ఫ్రాంచైజీ (క్లబ్)గా ముంబై రికార్డు సృష్టించింది. ఇప్పట...