భారతదేశం, ఆగస్టు 22 -- Mohan Babu University Scholarships : ఉన్నత విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తిరుపతిలోని ప్రముఖ విద్యా సంస్థ మోహన్ బాబు యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ విధానాన్ని ప్రకటించింది. ప్రతిభ, ఆర్థిక వెనుకబాటుతనం, సామాజిక నేపథ్యాలు, ప్రత్యేక ప్రతిభ ఆధారంగా అర్హులైన విద్యార్థులకు బోధనా రుసుము (ట్యూషన్ ఫీజు)లో ఏకంగా 100 శాతం వరకు మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఈ సమగ్ర స్కాలర్‌షిప్ విధానం కింద కుటుంబంలో ఒక్కరే ఆడపిల్ల అయిన విద్యార్థినులు, భారత సాయుధ దళాల సిబ్బంది, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, వర్సిటీకి 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పాత విద్యార్థులు (అలుమ్ని), రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలితరం గ్రాడ్...