భారతదేశం, మే 28 -- దాదాపు ఒక వారం పాటు 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అల్లాడిపోయిన తర్వాత.. బుధవారం (మే 27) నాడు వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాలకు ఉపశమనాన్ని కల్పించాయి. ఒక వారం కంటే ఎక్కువ కాలం తర్వాత.. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల కంటే తక్కువగా నమోదైంది. బుధవారం అత్యధిక ఉష్ణోగ్రత 41.8 డిగ్రీలుగా నమోదైంది. ఇది పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో రికార్డయింది. మే 18 నుండి, ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు నిలకడగా 44 డిగ్రీల కంటే పైనే నమోదవుతూ వచ్చాయి.

గత వారం రోజులుగా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు వరుసగా చూసుకుంటే.. మే 18న 44.3 డిగ్రీలు, మే 19న 45.6 డిగ్రీలు, మే 20న 47.6 డిగ్రీలు, మే 21న 48.1 డిగ్రీలు, మే 22న 44.8 డిగ్రీలు, మే 23న 45.8 డిగ్రీలు, మే 24న 48.3 డిగ్రీలు, మే 25న 48.1 డిగ్రీలు, మే 26న...