భారతదేశం, మార్చి 28 -- మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. అయితే వారి మృతదేహాలను గుర్తుపట్టలేని విధంగా ఉండగా. డీఎన్ఏ పరీక్షలతో గుర్తించారు.

మార్కాపురం జీజీహెచ్ లో పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోయారు. గురువారం రాత్రి తోబుట్టువుల (మొత్తం 22 మంది) నుంచి గుంటూరు రీజినల్ పోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఆర్ఎస్ఎస్ఎల్) నిపుణులు రక్త నమూనాలు సేకరించారు.తోబుట్టువుల నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్ లో పరీక్షించారు. శుక్రవారం రాత్రి వరకు ఈ వెలువడ్డాయి. వీటి ఆధారంగా మృతదేహాల గుర్తింపు కార్డులోని వివరాలతో అనుసంధానం చేశారు.

శనివారం ఉదయం నుంచి తోబుట్టవులకు మృతదేహాలను అప్పగిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసే అంబులెన్సుల ద్వారా స్వస్థలాలకు మృతదేహాలను ఎస్కార్ట్ సాయ...