భారతదేశం, మే 11 -- Manchu Manoj Tweet On Bandi Bhageerath Pocso Case: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. రాజకీయంగా, సామాజికంగా అత్యంత సున్నితమైన అంశాలపై స్పందించే మనోజ్.. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసుపై గొంతు విప్పారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి. రాజకీయ పలుకుబడి, పదవి లేదా హోదా అనేవి ఎప్పుడూ న్యాయానికి అడ్డుగోడలుగా నిలవకూడదని మంచు మనోజ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

"కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు బండి భగీరథ్‌పై ఇటీవల నమోదైన పోక్సో కేసు నన్ను తీవ్రంగా కలచివేసింది. పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రతి మైనర్ బాలికకు...