భారతదేశం, ఏప్రిల్ 14 -- పెట్రోల్, డీజిల్ డిమాండ్ తగ్గిందని, ప్రస్తుతం యుద్ధానికి ముందు స్థాయికి చేరుకుందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) తెలిపాయి. భయాందోళనలతో వినియోగదారులు చేసే బుకింగ్‌లు గణనీయంగా తగ్గడంతో ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్‌లు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు సుమారు 2.18 లక్షల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. యుద్ధానికి ముందు రోజుకు సగటున 2.15 లక్షల సిలిండర్లు సరఫరా అయ్యేవని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. ప్రస్తుత డిమాండ్‌ను తీర్చడానికి ఇది సరిపోతుందని కూడా ప్రకటించాయి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ ప్రకారం.. సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. లాజిస్టిక్స్‌ను క్రమబద్ధీకరించడానికి, డెలివరీలను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టారు. కార్యాచరణ సమస్య...