భారతదేశం, ఆగస్టు 25 -- ఎల్పీజీ కనెక్షన్ల కోసం e-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి ఆగస్టు 23న ఉన్న గడువును ఆగస్టు 31 వరకు పొడిగించడంతో, వినియోగదారులకు కొంత ఊరట లభించింది. గృహ వినియోగదారులకు e-KYC లేదా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ చాలా కీలకం. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు గృహ వినియోగ ధరకే ఎల్పీజీ రీఫిల్స్‌ను పొందడం కొనసాగించడానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఇటీవల వినియోగదారులను కోరుతున్నాయి.

కొత్తగా గడువును ఆగస్టు 31 వరకు పెంచినట్టుగా తెలుస్తోంది. e-KYC పూర్తి చేయని వారికి దీనికి సంబంధించిన సందేశం అందుతుందని అధికారులు అంటున్నారు. గణాంకాల ప్రకారం దేశంలో ఉన్న 32.97 కోట్ల మంది క్రియాశీల గృహ ఎల్పీజీ వినియోగదారులలో 1.26 కోట్ల మంది తెలంగాణలో ఉన్నారు. రాష్ట్రంలోని వినియోగదారులలో సుమారు 82 శాతం మంది ఇప్పటికే e-...