భారతదేశం, మార్చి 11 -- దేశంలో చమురు, గ్యాస్‌ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో కొరత కారణంగా హాస్టళ్లకు తాత్కాలికంగా టీ, కాఫీ అందించరాదని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టళ్ల సంఘం ఏకంగా ప్రకటన కూడా చేసింది. టిఫిన్లు, ఇతర సమయం తీసుకునే లేదా అధిక నూనె వినియోగించే అల్పాహార వస్తువులను మెనూలో నుంచి తీసేయాలని తెలిపింది.

కట్ చేస్తే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకొని.. మోసాలకు పాల్పడేందుకు సైబర్ కేటుగాళ్లు సిద్ధమవుతున్నారు. ఇదే విషయంపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్.. హెచ్చరిక ప్రకటన చేశారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సై...