భారతదేశం, ఏప్రిల్ 3 -- తెలంగాణలో ఎల్పీజీపై జనాల్లో ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఓ వైపు ప్రభుత్వం ఎల్పీజీ కొరత లేదని ప్రకటనలు జారీ చేస్తున్నా.. ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సిలిండర్లు బుక్ అయ్యాయి. ఇప్పుడు వాటిని డెలివరీ చేసేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

తెలంగాణలో 15 లక్షలకుపైగా సిలిండర్ల డెలివరీ పెండింగ్‌లో ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కూడా ఇన్ని బుకింగ్స్‌కు ఒక కారణంగా చెప్పవచ్చు. వీటన్నింటినీ సరఫరా చేసేందుకు వారం రోజులపైనే పడుతుంది. లాక్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ సమస్యలతో గ్యాస్ బుకింగ్స్ సంఖ్య తగ్గింది. అయితే సరఫరా వ్యవస్థలో లోపాలతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం. బుక్ చేసిన తర్వాత కస్టమర్ ఇంటికి సిలిండర్ వచ్చేందుకు రెండుమూడు వారాలపైనే పడుతుంది.

తెలంగాణలో 1.30 క...