భారతదేశం, మార్చి 24 -- గత 11 నెలల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద తెలంగాణలో 51,112 కొత్త ఎల్పీజీ కనెక్షన్లను భారత ప్రభుత్వం కల్పించిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభకు తెలిపారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. గత నాలుగేళ్లలో ఏ ఏడాదిలోనూ లేనంతగా ఈ కాలంలో కనెక్షన్ల పంపిణీ ఎక్కువగా ఉందని కేంద్రమంత్రి తెలిపారు.

PMUY పథకం ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల వంటచెరకు వంటి సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం తగ్గడంతో పాటు ఆరోగ్యం, పర్యావరణ ఫలితాలు కూడా మెరుగుపడతాయని కేంద్రం భావిస్తోంది

మరోవైపు తెలంగాణలో వంటగ్యాస్ కొరతపై శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ తక్షణమే చర్చ జరపాలని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) శాసనసభ పక్షం డిమాండ్ చేసింది. ఈ కొర...