భారతదేశం, ఆగస్టు 3 -- దేశీయ ప్రైమరీ మార్కెట్‌లో మరో ఐపీఓ సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ అస్సెట్ పూలింగ్ ప్లాట్‌ఫామ్ లీప్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి (IPO) సంబంధించిన ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్లు ఆగస్టు 7న ప్రారంభమై, ఆగస్టు 11న ముగుస్తాయి.

రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేరు ప్రైస్ బ్యాండ్‌ను రూ.151 నుంచి రూ.159గా ఖరారు చేశారు. ప్రధాన ఇన్వెస్టర్ల (Anchor Investors) బిడ్డింగ్ ఆగస్టు 6న ప్రారంభమవుతుంది.

ఇందులో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బైయర్లకు (QIB) గరిష్ఠంగా 50 శాతం, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII) కనీసం 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు కనీసం 35 శాతం చొప్పున కోటాను కేటాయించారు. అలాగే అర్హులైన కంపెనీ ఉద్యోగుల కోసం రూ.1.25 కోట్ల విలువైన షేర్లను ప్రత్యేకంగా కేటాయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ...