భారతదేశం, ఏప్రిల్ 16 -- Kurnool road accident : కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్‌ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు.వీరిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.

ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన భక్తులు. మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. సుమారు 16 మంది భక్తులతో కూడిన గూడ్స్ వాహనం మంత్రాలయం వైపు వెళ్తోంది. చిలకలడోన ప్రాంతానికి చేరుకోగానే వేగంగా వచ్చిన ట్యాంకర్ వీరి వాహనాన్ని నేరుగా ఢీకొట్టింది. ఈ ప్...